పినపాక మండలం మల్లారం గ్రామంలో IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మకుండా నేరుగా కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించిందని, క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320, సాధారణ ధాన్యానికి రూ. 2300 రేటు నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి నాణ్యంగా తీసుకురావాలని సూచించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరగకుండా నిరోధించాలనే ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి ఓపీఎంఎస్ చేసి, డబ్బులు అందేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ADA తాతారావు, పినపాక ఎమ్మార్వో అద్దంకి నరేష్, MPDO రాఘవరపు రామకృష్ణ, APM జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *