యువతకు శుభవార్త – ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు శుభవార్త. మణుగూరు మరియు బూర్గంపాడు మండలాల్లోని కృష్ణసాగర్ ప్రభుత్వ ఐటీఐలలో 2025 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం జారీ చేయబడిందని పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు తెలిపారు.ఈ సందర్భంగా పాయం గారు మాట్లాడుతూ, జూన్ 2వ తేదీ నుండి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు మరియు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)లో ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

కోర్సుల వివరాలు:
కృష్ణసాగర్ మరియు మణుగూరు ప్రభుత్వ ఐటీఐలలో ఈ క్రింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి:

  • ఎలక్ట్రిషియన్

  • ఫిట్టర్

  • డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)

  • డీజిల్ మెకానిక్

  • కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)

మణుగూరు ATC కేంద్రంలో ప్రత్యేక కోర్సులు:

  • మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ (1 సంవత్సరం)

  • ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ (1 సంవత్సరం)

  • ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ (1 సంవత్సరం)

  • బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫైయర్ – మెకానికల్ (2 సంవత్సరాలు)

  • అడ్వాన్స్డ్ CNC మిషనింగ్ టెక్నీషియన్ (2 సంవత్సరాలు)

  • మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ (2 సంవత్సరాలు)

అర్హత:
పదో తరగతి పూర్తిచేసిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు.

దరఖాస్తు విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు http://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలెను.

ఈ అవకాశాన్ని యువత మరువకూడదని, భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవాలని పాయం వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు.

ఇది ఒక ఉత్తమ అవకాశంగా ఉపయోగించుకొని నైపుణ్యం పొందిన వృత్తిలో స్థిరపడండి!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *