బూర్గంపాడు మండలంలో 65 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పలు సీ.సీ. రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

తేదీ: 25.11.2024
స్థానం: బూర్గంపాడు మండలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా:

👉 సారపాక గ్రామ పంచాయతీ
👉 గాంధీనగర్
👉 బొగ్గు సూర
👉 భాస్కర్ నగర్
👉 పాల కేంద్రం

65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గ్రామస్తులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగానే, సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజల కోరిక మేరకు రోడ్లను వేయించి ప్రజల సమస్యలను తీర్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

  • ప్రభుత్వ అధికారులు
  • బూర్గంపాడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి
  • కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
  • మహిళా నాయకులు
  • యువజన నాయకులు
  • కార్యకర్తలు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *