హైదరాబాదులో ఆదివాసీ విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యేకు వినతి

తేదీ: 17 నవంబర్ 2024
స్థలం: మణుగూరు ప్రజా భవన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆదివాసీ ఓయూ విద్యార్థి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో చదువుకుంటున్న ఆదివాసీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

వినతి వివరాలు:


ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాగబోయిన పాపారావు మాట్లాడుతూ, హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఆదివాసీ విద్యార్థులు నివాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలోని నాగోల్‌లో ఉన్న బాలుర హాస్టల్ అద్దె భవనంలో ఇరుకు గదులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా, అడిక్‌మెట్‌లోని బాలికల హాస్టల్ విద్యార్థుల సంఖ్య అధికమవడంతో, తక్షణమే ఖాళీ స్థలంలో నూతన హాస్టల్ భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే స్పందన:

ఆదివాసీ విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరేం అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు గౌరీ వేణి ప్రవీణ్, సోడే నవీన్ కుమార్, నాయకులు కొమరం ప్రకాష్, వంశి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *